నల్గొండ జిల్లా నార్కట్పల్లి మండలం ఉదయసముద్రం బ్రాహ్మణవెల్లం ఎత్తిపోతల పథకం పనులను ముఖ్యమంత్రి కార్యాలయ కార్యదర్శి స్మితా సబర్వాల్ పరిశీలించారు. ప్రాజెక్ట్ పనుల పురోగతిని గూర్చి అధికారులను అడిగి తెలుసుకున్నారు. పంప్హౌస్, టన్నెల్ నిర్మాణం పూర్తి అయిందని.. లైనింగ్ పనులు మిగిలున్నాయని అధికారులు వివరించారు. భూసేకరణ వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.
బ్రాహ్మణవెల్లం ఎత్తిపోతల పథకాన్ని సందర్శించిన స్మితా సబర్వాల్
ఉదయ సముద్రం బ్రాహ్మణవెల్లం ఎత్తిపోతల పథకాన్ని సీఎంవో కార్యదర్శి స్మితా సబర్వాల్ పరిశీలించారు. ప్రాజెక్టు పనుల పురోగతిపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.
బ్రాహ్మణవెల్లం ఎత్తిపోతల పథకాన్ని సందర్శించిన స్మితా సబర్వాల్