నల్గొండ జిల్లా చిట్యాల మండలం నేరడ గ్రామంలో కార్తీకశోభ నెలకొంది. ఈరోజు ఆరుద్ర నక్షత్రం సందర్భంగా ప్రాచీన శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పండితులచే గణపతి, రుద్రయాగం శాస్త్రోక్తంగా జరిపించారు.
శాస్త్రోక్తంగా గణపతిహోమం, రుద్రయాగం.. - Rudra Yagam
కార్తీకమాసం, ఆరుద్ర నక్షత్రం సందర్భంగా నల్గొండ జిల్లా నేరడ గ్రామంలో గణపతిహోమం, రుద్రయాగం శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ హోమాల్లో దంపతులు పాల్గొన్ని ప్రత్యేక పూజలు చేశారు.
శాస్త్రోక్తంగా రుద్రయాగం..
ఈ హోమాల్లో దంపతులు పాల్గొన్ని ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు భారీ సంఖ్యలో తరలొచ్చి ఆ పరమశివుడిని దర్శించుకున్నారు. శివనామస్మరణ చేస్తూ తన్మయత్వంలో మునిగిపోయారు. అయ్యప్ప దీక్షాధారులు పాల్గొని భజనలతో హోరెత్తించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.
Last Updated : Nov 16, 2019, 5:02 PM IST