నల్గొండ జిల్లాలో నిన్న సాయంత్రం ఈదురు గాలులతో కూడిన అకాలవర్షం బీభత్సం సృష్టించింది. ముఖ్యంగా నల్గొండ మండలంలోని రాములబండా, పాలిపార్ల గూడెం,తోరగల్లు,కాకుల కొండారం,దుప్పలపల్లి,అప్పాజీపేటతోపాటు పలు గ్రామాల్లో భారీ స్థాయిలోనే ఆస్తినష్టం జరిగింది.
వర్షం ఓ మోస్తరుగా కురిసినప్పటికీ... ఈదురు గాలిబాగా వీయడం వల్ల పలువురి ఇంటిపై కప్పులు ఎగిరిపోగా... గోడలు కూలీపోయాయి. విద్యుత్ స్తంభాలు విరిగిపోవడం వల్ల రాత్రి కరెంట్ లేక ప్రజలు ఇబ్బందులకు గురయ్యారు.