నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం తడకమళ్ల గ్రామ శివారులో అక్రమంగా తరలిస్తున్న 78 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యాన్ని... పోలీసులు, పౌరసరఫరాల శాఖ అధికారులు పట్టుకున్నారు. పలు గ్రామాల్లో సేకరించిన బియ్యాన్ని కొంతమంది వాహనాల్లో తరలిస్తున్నారన్న సమాచారంతో అధికారులు దాడులు చేశారు.
అక్రమంగా తరలిస్తున్న పీడీఎస్ బియ్యం పట్టివేత - నల్లగొండ జిల్లా తాజా వార్తలు
నల్గొండ జిల్లా మిర్యాలగూడలో అక్రమంగా తరలిస్తున్న పీడీఎస్ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. లారీ, బొలెరో వాహనాన్ని స్వాధీనం చేసుకుని... ఇద్దరు డ్రైవర్లను అరెస్టు చేసినట్లు తెలిపారు.
![అక్రమంగా తరలిస్తున్న పీడీఎస్ బియ్యం పట్టివేత police Seized of illegally moving 78 quintals PDS rice in miryalaguda](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10324799-464-10324799-1611225312676.jpg)
అక్రమంగా తరలిస్తున్న పీడీఎస్ బియ్యం పట్టివేత
బియ్యాన్ని తరలిస్తున్న ఒక లారీ, బొలెరో వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు డ్రైవర్లను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు మిర్యాలగూడ రూరల్ పోలీసులు తెలిపారు.
ఇదీ చదవండి:'కులాల తొలగింపుపై నివేదిక కోరిన జాతీయ బీసీ కమిషన్'