తెలంగాణ

telangana

ETV Bharat / state

సీఎం ఎన్నికల ప్రచార సభ ఆపాలని రైతుల పిటిషన్‌ - సీఎంపై సభను అడ్డుకోవాలని రైతుల పిటిషన్

petition on kcr public meeting on april 14th at anumula in nagarjunasagar
సీఎం కేసీఆర్ సభను ఆపాలని హైకోర్టులో పిటిషన్

By

Published : Apr 12, 2021, 2:01 PM IST

Updated : Apr 12, 2021, 2:47 PM IST

14:00 April 12

సీఎం ఎన్నికల ప్రచార సభ ఆపాలని రైతుల పిటిషన్‌

          నాగార్జునసాగర్ ఉపఎన్నికలో ప్రచారంలో భాగంగా నల్గొండ జిల్లా అనుములలో నిర్వహించనున్న సీఎం కేసీఆర్ సభను ఆపాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ప్రజల ఆరోగ్యం దృష్ట్యా ఈనెల 14న జరగనున్న సభకు అనుమతి ఇవ్వొద్దని అనుములకు చెందిన రైతులు గోలి సైదిరెడ్డి, గోలి శ్రీనివాస్​రెడ్డి పిటిషన్ వేశారు.  

  కొవిడ్ నిబంధనలకు విరుద్ధంగా సభకు తెరాస ఏర్పాట్లు చేస్తోందని హైకోర్టుకు పిటిషనర్లు తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో అత్యవసర విచారణ చేపట్టేందుకు లంచ్ మోషన్ పిటిషన్​గా   హైకోర్టు స్వీకరించింది.  

ఇదీ చూడండి:పోలీసులకు సవాల్‌గా మారిన ‘గసగసాల’ కేసు

Last Updated : Apr 12, 2021, 2:47 PM IST

ABOUT THE AUTHOR

...view details