అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని ఆరోపిస్తూ ఏబీవీపీ ఆధ్వర్యంలో విద్యార్థుల తల్లిదండ్రులు ధర్నాకు దిగారు. నల్గొండ పట్టణంలోని దేవరకొండ రోడ్డులో ఉన్న మౌంట్పోర్ట్ పాఠశాల గేట్ ముందు ఆందోళన చేపట్టారు.
" రెండు రోజుల క్రితం ఫీజుల గురించి మాట్లాడదామని చెప్పి విద్యార్థుల తల్లిదండ్రులను పాఠశాల యాజమాన్యం స్కూల్ కి రమ్మని చెప్పింది. పేరెంట్స్ అందరూ వచ్చేసరికి.. పాఠశాల లోపలికి వెళ్లకుండా గేట్ మూసివేసి, పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. యాజమాన్యం ముఖం చాటేస్తుంది"