తెలంగాణ

telangana

By

Published : Apr 4, 2021, 5:53 PM IST

ETV Bharat / state

'సునీల్‌ ఆత్మ శాంతి కోసం తెరాసను ఓడించాలి'

సునీల్‌ నాయక్ ఆత్మకు శాంతి చేకూరాలంటే సాగర్ ఉప ఎన్నికలో తెరాసను ఓడించాలని ఓయూ నిరుద్యోగ జేఏసీ నాయకులు ప్రజలను కోరారు. తెరాసకు వ్యతిరేకంగా ఓటు వేయాలంటూ హాలియాలో ప్రచారం చేపట్టారు.

OU JAC campaign against Trs
ఓయూ నిరుద్యోగ జేఏసీ ప్రచారం

విద్యార్థులను నిరుద్యోగులగా మార్చడానికి సీఎం కేసీఆర్ కంకణం కట్టుకున్నారని ఓయూ, కేయూ నిరుద్యోగ జేఏసీ నాయకులు ఆరోపించారు. నల్గొండ జిల్లా హాలియాలో కరపత్రాలు పంచుతూ తెరాస పార్టీకి వ్యతిరేకంగా ప్రచారం నిర్వహించారు. సునీల్‌ నాయక్ ఆత్మకు శాంతి చేకూరాలంటే సాగర్ ఉప ఎన్నికలో తెరాసను ఓడించాలని ప్రజలను కోరారు.

తెరాసకు వ్యతిరేకంగా 15 రోజుల పాటు ప్రచారం చేస్తామని తెలిపారు. వివిధ ప్రాంతాల నుంచి 200 మంది వరకు వచ్చి ప్రతి ఒక్క ఓటర్‌ని కలుస్తామని అన్నారు. నిరుద్యోగయువతకు అండగా ఉండాలని ఓటర్లను కోరారు.

ఇదీ చదవండి:పంచాయతీ ఎన్నికల్లో అందాల భామ పోటీ!

ABOUT THE AUTHOR

...view details