నల్గొండ జిల్లా నకిరేకల్ మున్సిపల్లో ఓటింగ్ కొనసాగుతోంది. ఈ మేరకు 40 పోలింగ్ బూతులు ఏర్పాటు చేశారు. 20 వార్డులకుగాను 93 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. మొత్తం 21వేల 382 మంది ఓటర్లు ఓటు వేయనున్నారు. కరోనా నిబంధనల మధ్య ఓటింగ్ జరుగుతోంది.
మేజర్ గ్రామ పంచాయితీ నుంచి కొత్తగా ఏర్పడిన నల్గొండ జిల్లా నకిరేకల్ మున్సిపాలిటీలో తొలిసారిగా ఎన్నికలు జరుగుతున్నాయి. నకిరేకల్ సమీపంలోని ఏడు గ్రామాలను మున్సిపాలిటీలోకి విలీనం చేసి 20 వార్డులు ఏర్పాటు చేశారు.