తెలంగాణ

telangana

ETV Bharat / state

లారీని ఢీకొట్టిన ట్రాక్టర్... మహిళ మృతి - nalgonda crime news

నల్గొండ జిల్లా శెట్టిపాలెం వద్ద ఓ ట్రాక్టర్ లారీని ఢీకొట్టింది. ఈ ఘటనలో ఓ మహిళ మృతి చెందగా మరో నలుగురు తీవ్ర గాయాలపాలయ్యారు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

accident in nalgonda
లారీని ఢీకొట్టిన ట్రాక్టర్... మహిళ మృతి

By

Published : May 7, 2020, 9:00 PM IST

నల్గొండ జిల్లా వేములపల్లి మండలం శెట్టిపాలెం గ్రామ శివారులో అద్దంకి-నార్కెట్​పల్లి రహదారిపై ఓ ట్రాక్టర్ లారీని ఢీకొట్టింది. ఈ ఘటనలో ఓ మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. మాడుగులపల్లి మండలం కన్నెకల్ గ్రామానికి చెందిన ఐకేపీ నిర్వాహకురాలు సౌందర్య ధాన్యం కొనుగోలు అయిపోవడం వల్ల మిగిలిన బస్తాలు, కాంటాలను ట్రాక్టర్​లో తీసుకొని మిర్యాలగూడ వ్యవసాయ మార్కెట్​కు బయలుదేరింది.

మహాతేజ మిల్లు వద్దకు చేరుకోగానే ట్రాక్టర్ లారీని ఢీకొట్టింది. సౌందర్య కిందపడి అక్కడికక్కడే మృతి చెందింది. మృతురాలికి భర్త, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ట్రాక్టర్​లో ప్రయాణిస్తున్న మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. విషయం గమనించిన స్థానికులు క్షతగాత్రులను మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

ఇవీ చూడండి:విశాఖ ఘటనపై సీఎం కేసీఆర్​ దిగ్భ్రాంతి ​

ABOUT THE AUTHOR

...view details