తెలంగాణ

telangana

ETV Bharat / state

నవ నాగదత్త యాగం - వేణుగోపాలస్వామి ఆలయం

నల్గొండ జిల్లా గోపలాయిపల్లిలోని వేణుగోపాలస్వామి ఆలయంలో నవ నాగదత్త యాగం నిర్వహిస్తున్నారు. 89 ఏళ్లకు ఓసారి వచ్చే ఈ ముహూర్తానికి వివిధ ప్రాంతాల నుంచి భక్తులు వేలాది తరలి వచ్చారు.

నవ నాగదత్త యాగం

By

Published : Mar 6, 2019, 11:45 AM IST

వేణుగోపాలస్వామి ఆలయానికి పోటెత్తిన భక్తులు

నల్గొండ జిల్లా నార్కట్​పల్లి మండలం గోపలాయిపల్లి గ్రామంలోని వేణుగోపాలస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. అమావాస్య సందర్భంగా ఆలయంలో నవ నాగదత్త యాగం నిర్వహిస్తున్నారు. 89 సంవత్సరాలకు ఒక్కసారి ఇలాంటి ముహూర్తం వస్తుందని పండితులు అంటున్నారు. నేడు స్వామివారిని దర్శించుకున్న వారి కోర్కెలు తీరుతాయని, శనిదోషాలు తొలుగుతాయని ప్రచారం ఉండటంతో... హైదరాబాద్ నుంచి భక్తులు వేలాదిగా తరలి వచ్చారు. దర్శనం కోసం భక్తులు బారులు తీరారు.

ABOUT THE AUTHOR

...view details