తెలంగాణ

telangana

ETV Bharat / state

నాంపల్లి హత్యకేసు నిందితులు రిమాండ్​కు తరలింపు - Nampally Murder case

భర్త మరణించాక.. ఆమెకు ఓ వ్యక్తి దగ్గరయ్యాడు. హైదరాబాద్ వచ్చి వాళ్లిద్దరూ కొన్నాళ్లు సహజీవనం చేశారు. కొద్ది రోజులు వారిద్దరూ బాగానే ఉన్నారు. కానీ ఆమె అనుమానాస్పద రీతిలో చనిపోయింది. తమ సోదరి చావుకు ప్రియుడే కారణమని భావించి అతనిపై కొబ్బరి బోండాల కత్తితో తల నరికి చంపారు. నిందితులను అదుపులోకి తీసకుని రిమాండ్​కు తరలించినట్లు జిల్లా ఎస్పీ వెంకటేశ్వర్లు వెల్లడించారు.

నాంపల్లి నిందితులను రిమాండ్​కు తరలింపు

By

Published : Jul 21, 2019, 9:51 PM IST

నల్గొండ జిల్లా అనుముల మండలం మారెపల్లి గ్రామానికి చెందిన ఇర్ఫాన్‌, నాంపల్లికి చెందిన ఎండీ గౌస్‌.. నేరెళ్ల గ్రామానికి చెందిన సద్దాం అనే యువకుడిని హత్య చేసి.. తలను శరీరం నుంచి వేరు చేశారు. తల తీసుకొని పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయారు. వీరికి సోదరి వరసయ్యే ఓ మహిళను సద్దాం చంపేశాడనే అనుమానంతోనే అతని హతమార్చారు.

అసలేం జరిగిందంటే...

ఇర్ఫాన్, గౌస్​కు సోదరి వరసయ్యే ఓ మహిళకు అంతకు ముందే వేరే వ్యక్తితో పెళ్లయ్యింది. కానీ భర్త చనిపోయాడు. ఆటో డ్రైవర్‌గా పని చేసే సద్దాం ఆమెకు దగ్గరయ్యాడు. అనంతరం ఆమెను హైదరాబాద్ తీసుకొచ్చి సహజీవనం ప్రారంభించాడు. 2017లో ఆమె అనుమానాస్పద రీతిలో ప్రాణాలు వదిలింది. తమ సోదరి చనిపోవడానికి సద్దామే కారణమని ఇర్ఫాన్, గౌస్ బలంగా నమ్మారు.

పథకం ప్రకారమే హత్య

అదును కోసం వేచి చూసిన వీరిద్దరూ.. శనివారం సాయంత్రం నాంపల్లిలోని ఎస్సీ కాలనీలో కొబ్బరి బోండాల కత్తితో సద్దాం తల నరికారు. తలతో పాటు నేరుగా పోలీస్​ స్టేషన్​కు వెళ్లి అక్కడ లొంగిపోయారు. ఈ ముగ్గురికి గతంలో మంచి స్నేహం ఉన్నట్లు సమాచారం. నిందితులను అరెస్టు చేసి పోలీసులు రిమాండ్​కు తరలించారు.

నాంపల్లి హత్య కేసు నిందితులకు రిమాండ్

ఇవీచూడండి:హత్య చేసి.. తలతో పోలీస్​ స్టేషన్​కు

ABOUT THE AUTHOR

...view details