తెలంగాణ

telangana

By

Published : Jul 9, 2020, 10:14 PM IST

Updated : Jul 9, 2020, 10:47 PM IST

ETV Bharat / state

ఉమ్మడి నల్గొండలో కరోనా కలకలం.. ఒక్కరోజే 29 కేసులు

ఉమ్మడి నల్గొండ జిల్లాలో క‌రోనా మహమ్మారి తీవ్రత కొనసాగుతోంది. ఇవాళ 29 కొత్త కేసులు నమోదయ్యాయి. నల్గొండలో 17, సూర్యాపేటలో 7, యాదాద్రి జిల్లాలో 5 కేసులు నిర్ధరణ అయ్యాయి.

nalgonda-old-district-corona-cases-latest-updates
ఉమ్మడి నల్గొండలో కరోనా కలకలం.. ఒక్కరోజే 29 కేసులు

ఉమ్మడి నల్గొండ జిల్లాలో రోజు రోజుకు కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఇవాళ 29 కొత్త కేసులు నమోదయ్యాయి. నల్గొండలో 17, సూర్యాపేటలో 7, యాదాద్రి జిల్లాలో 5 నిర్ధరణ అయ్యాయి.

నల్గొండ జిల్లా....

నల్గొండలో 17 కేసులు నమోదయ్యాయి. ఒకరు ప్రాణాలు కోల్పోయారు. జిల్లా కేంద్రంలో అత్యధికంగా 10 మందికి కొవిడ్‌ నిర్ధరణ కాగ, మిర్యాలగూడలో నలుగురు, నకిరేకల్‌లో ఇద్దరు, నార్కట్‌పల్లి మండలంలో ఒకరు కరోనా వైరస్ బారిన పడినట్లు జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి తెలిపారు. జిల్లావ్యాప్తంగా మొత్తం కేసుల సంఖ్య 145కు చేరగా... ఇప్పటివరకు ఐదుగురు మృత్యువాత పడ్డారు. ప్రస్తుతం 120 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. మొత్తంగా 426 మందికి సంబంధించిన ఫలితాలు రావాల్సి ఉందని అధికారులు తెలిపారు.

సూర్యాపేట జిల్లా..

సూర్యాపేటలో 7 కేసులకు గాను... కోదాడలో నలుగురు, జిల్లా కేంద్రంతోపాటు, చిలుకూరు, చింతలపాలెం మండలాల్లోనూ ఒక్కొక్కరు చొప్పున వ్యాధికి గురయ్యారు. ఒకరు కొవిడ్‌ కారణంగా ప్రాణాలు కోల్పోయారు. జిల్లాలో మొత్తం కేసుల సంఖ్య 143 చేరింది.

యాదాద్రి జిల్లా..

యాదాద్రి భువనగిరి జిల్లాలో 5 కేసులు నమోదయ్యాయి. అందులో యాదగిరిగుట్టలో 2, బీబీనగర్, రామన్నపేట, చౌటుప్పల్ మండలాల్లో ఒక్కోటి చొప్పున బయటపడ్డాయి. జిల్లాలో మొత్తం కేసుల సంఖ్య 38క చేరింది.

ఇదీ చూడండి:కరోనా లీలలు: పైసల కోసం బతికున్న మనిషిని చంపేశారు!

Last Updated : Jul 9, 2020, 10:47 PM IST

ABOUT THE AUTHOR

...view details