నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నియంత్రిత సాగు విధానంపై జరిగిన సన్నాహక సమావేశంలో మంత్రి జగదీశ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని డీసీసీ డిమాండ్ చేసింది. సూర్యాపేట జిల్లా కేంద్రంలో డీసీసీ అధ్యక్షుడు చెవిటి వెంకన్న యాదవ్ ఆధ్వర్యంలో జిల్లా మంత్రి జగదీష్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం చేశారు.
రైతు ఋణ మాఫీపై టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి నిలదీసినందుకు సహనం కోల్పోయిన మంత్రి.. సమాధానం చెప్పలేక ఆయనపై అనుచిత వ్యాఖ్యలు చేయడంపై డీసీసీ మండిపడింది. మంత్రి వ్యాఖ్యలకు నిరసిస్తూ దిష్టిబొమ్మ దగ్ధం చేశామన్నారు. బేషరతుగా మంత్రి తన వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలని జిల్లా పార్టీ డిమాండ్ చేసింది.
మాజీ సైనికుడిని అవమానించారు...