తెలంగాణ

telangana

ETV Bharat / state

ఉదయ సముద్రం పనులపై కలెక్టర్ ఆరా

ఉదయం సముద్రం ఎత్తిపోతల పనులను నల్గొండ ఇంఛార్జి కలెక్టర్ వి. చంద్రశేఖర్​ పరిశీలించారు. పనుల పురోగతిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. కాలువల నిర్మాణానికి భూ సేకరణ చేస్తున్నట్లు తెలిపారు.

By

Published : Nov 20, 2019, 9:16 PM IST

ఉదయ సముద్రం పనులపై కలెక్టర్ ఆరా

నల్గొండ జిల్లా నార్కట్​పల్లి మండలంలోని ఉదయ సముద్రం ఎత్తిపోతల పథకం పనులను ఇంఛార్జి కలెక్టర్​ వి. చంద్రశేఖర్​ పరిశీరించారు. సర్జిపూల్​, టన్నెల్ పనుల పురోగతిపై అధికారులను ఆరా తీశారు. లైనింగ్​ పనులు 90 శాతం, పంప్​హౌస్​ పనులు పూర్తైనట్లు తెలిపారు. కాలువల నిర్మాణానికి 3వేల 880 ఎకరాల భూమి కావాల్సి ఉండగా... 1310 ఎకరాల భూమి సేకరించినట్లు వెల్లడించారు. టన్నెల్​ లైనింగ్​ పూర్తి కావటానికి సంవత్సరం పడుతుందన్నారు. కలెక్టర్​తో పాటు ఆర్డీవో జగదీశ్వర్​ రెడ్డి, ఏఎంఆర్​పీ ఎస్​ఈ సాయిబాబా, ఈఈ యాదన్​ కుమార్ పాల్గొన్నారు.

ఉదయ సముద్రం పనులపై కలెక్టర్ ఆరా

ABOUT THE AUTHOR

...view details