తెలంగాణ

telangana

ETV Bharat / state

కుటుంబంతో సహా సీఎం వద్దకు నాగార్జునసాగర్​ ఎమ్మెల్యే - telangana news

నాగార్జునసాగర్​ ఎమ్మెల్యే నోముల భగత్​.. కుటుంబ సభ్యులతో సహా ముఖ్యమంత్రి కేసీఆర్​ను కలిశారు. ఉపఎన్నికలో విజయం తర్వాత.. తొలిసారి కేసీఆర్​ను కలిసి ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు.

nagarjuna sagar mla meet cm kcr
సీఎం కేసీఆర్​ను కలిసిన నాగార్జునసాగర్​ ఎమ్మెల్యే

By

Published : May 10, 2021, 6:50 PM IST

Updated : May 10, 2021, 7:13 PM IST

నల్గొండ జిల్లా నాగార్జునసాగర్​ ఉపఎన్నికలో విజయం సాధించి ఎమ్మెల్యేగా ఎన్నికైన నోముల భగత్​ ముఖ్యమంత్రి కేసీఆర్​ను కలిశారు. ఎన్నికల్లో విజయం తర్వాత తొలిసారి కేసీఆర్​ను కలిశారు. కుటుంబ సభ్యులతో సహా ప్రగతిభవన్​కు వెళ్లిన భగత్​.. సీఎం ఆశీర్వాదం తీసుకున్నారు.

ఈ సందర్భంగా భగత్​ కుటుంబ సభ్యులతో.. కేసీఆర్ సరదాగా​ ముచ్చటించారు. నోముల నర్సింహయ్యతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నట్లు సమాచారం. అన్ని విధాల అండగా ఉంటానని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.

నియోజకవర్గం అభివృద్ధిపై దృష్టిసారించాలని.. ప్రభుత్వం పథకాలు సక్రమంగా అమలయ్యేలా చూడాలని.. ఎమ్మెల్యే భగత్​కు ముఖ్యమంత్రి సూచించినట్లు తెలుస్తోంది. నాగార్జునసాగర్​ ఉపఎన్నిక సందర్భంగా.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలుచేస్తామని భగత్​కు హామీ ఇచ్చినట్లు సమాచారం.

కుటుంబంతో సహా సీఎం వద్దకు నాగార్జునసాగర్​ ఎమ్మెల్యే

ఇవీచూడండి:'ఇద్దరు ముఖ్యమంత్రులు మాట్లాడుకొని సహకరించుకోవాలి'

Last Updated : May 10, 2021, 7:13 PM IST

ABOUT THE AUTHOR

...view details