తెలంగాణ

telangana

ETV Bharat / state

మూడ్రోజులకే చిన్నారి మృతి..బంధువుల ఆందోళన

నవ మాసాలు మోసింది. పురిటినొప్పులు భరించింది. పండంటి పాపకు జన్మనిచ్చింది. కానీ..మూడు రోజులకే శిశువు మృతి చెందింది. పాప మృతికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమని ఆస్పత్రి ముందు ఆందోళనకు దిగిన ఘటన నల్గొండలో జరిగింది.

By

Published : Jul 24, 2019, 12:38 PM IST

బంధువుల ఆందోళన

నల్గొండ జిల్లా తిప్పర్తి మండలం అనిశెట్టి దుప్పలపల్లికి చెందిన రెడ్డిపల్లి రేణుక ప్రసవం కోసం జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరింది. గత శనివారం రాత్రి ఆమె ఆడ శిశువుకు జన్మనిచ్చింది. రెండు రోజులు బాగానే ఉన్న శిశువు మంగళవారం మృతి చెందింది. ఏం జరిగిందని డాక్టర్లను ప్రశ్నించగా సమాధానం చెప్పడం లేదని రేణుక భర్త శివకుమార్​ చెప్పారు. పాప మృతికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమని ఆస్పత్రి ముందు ఆందోళన చేపట్టారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

మూడ్రోజులకే చిన్నారి మృతి..బంధువుల ఆందోళన

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details