తెలంగాణ

telangana

ETV Bharat / state

నల్లొండలో ప్రశాంతంగా స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ - స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు

స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్​ యాదాద్రిలో ప్రశాంతగా జరుగుతోంది. ప్రజాప్రతినిధులు ఉదయం నుంచి ఉత్సాహంగా ఓటింగ్​లో పాల్గొంటున్నారు. భువనగిరి డీసీపీ నారాయణరెడ్డి భద్రతా ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు.

ఎమ్మెల్సీ ఎన్నికలు

By

Published : May 31, 2019, 1:05 PM IST

​ ఉమ్మడి నల్గొండ జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. ఎమ్మెల్యే ఫైళ్ల శేఖర్ రెడ్డి, భువనగిరి మున్సిపాలిటీ చైర్మన్ నువ్వుల ప్రసన్న తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. భువనగిరిలో 165 మంది... చౌటుప్పల్​లో 83 మంది ఎమ్మెల్సీ ఓటర్లున్నారు. తెరాస, కాంగ్రెస్​ పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధులు ఉత్సాహంగా ఓటింగ్​లో పాల్గొంటున్నారు. భువనగిరి డీసీపీ నారాయణ రెడ్డి ఆధ్వర్యంలో 80 మంది పోలీసులతో భద్రతను పర్యవేక్షిస్తున్నారు. అధికారులు వెబ్​ కాస్టింగ్​ ద్వారా ఎప్పటికప్పుడు పరిస్థితి సమీక్షిస్తున్నారు.

ఉమ్మడి నల్గొండలో ప్రశాంతగా ఎమ్మెల్సీ పోలింగ్​

ABOUT THE AUTHOR

...view details