తెలంగాణ

telangana

ETV Bharat / state

గెలుపొందిన తెరాస నేతలకు నోముల సన్మానం

నాగార్జున సాగర్​ నియోజకవర్గ పరిధిలో ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, ఎంపీపీలు, వైస్​ ఛైర్మన్​లను ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య సన్మానించారు.

By

Published : Jun 9, 2019, 5:21 PM IST

గెలుపొందిన తెరాస నేతలకు నోముల సన్మానం

నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ నియోజకవర్గ పరిధిలోని గెలుపొందిన ఎంపీటీసీలకు, జడ్పీటీసీలకు, ఎంపీపీలకు ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య తన నివాసంలో పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. నల్గొండ జిల్లా జడ్పీ వైస్ ఛైర్మన్​గా గెలుపొందిన ఇరిగి పెద్దులుతో పాటు ఆరు మండలాల్లో తెరాస తరఫున గెలుపొందిన వారందరిని సన్మానించారు. కేసీఆర్ సంక్షేమ పథకాలను ప్రజలకు అందేలా చర్యలు తీసుకోవాలని నోముల వారికి దిశానిర్దేశం చేశారు. అత్యధిక స్థానాలను గెలుచుకోవడంలో సహకరించిన ప్రతి కార్యకర్తకు కృతజ్ఞతలు తెలిపారు.

గెలుపొందిన తెరాస నేతలకు నోముల సన్మానం

ABOUT THE AUTHOR

...view details