తెలంగాణ సమాజం సీఎం కేసీఆర్ వెంట నడుస్తోందని విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. ఇందుకు నాగార్జున సాగర్ ఫలితమే నిదర్శనమన్నారు. తెరాస అభ్యర్థి నోముల భగత్ను గెలిపించిన సాగర్ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. కేసీఆర్ను భాజపా, కాంగ్రెస్ వాళ్లు సభ్యత లేకుండా మాట్లాడారని.. దుబ్బాక ఒక్కటి గెలిచిన కాషాయం పార్టీ వారు ఎగిరి పడ్డారని విమర్శించారు.
సీఎంపై ఉన్న నమ్మకానికి నిదర్శనం ఈ ఫలితం: జగదీశ్ రెడ్డి - విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి వార్తలు
సీఎం కేసీఆర్పై ప్రజల్లో ఉన్న నమ్మకానికి నాగార్జున సాగర్ ఫలితమే నిదర్శనమని విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. తెలంగాణ సమాజం సీఎం కేసీఆర్ వెంట నడుస్తోందని చెప్పారు.
![సీఎంపై ఉన్న నమ్మకానికి నిదర్శనం ఈ ఫలితం: జగదీశ్ రెడ్డి minister jagadeesh reddy](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11617264-419-11617264-1619962391380.jpg)
జగదీశ్ రెడ్డి
సాగర్లో జానారెడ్డి గెలవకపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఛాలెంజ్ చేశారని... మరి ఇప్పుడు ఏం సమాధానం చెబుతారో చూడాలన్నారు. కోమటిరెడ్డి బ్రదర్స్కు మతిస్థిమితం లేకుండా పోయిందని విమర్శించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ కనుమరుగు అయిందన్నారు.
ఇదీ చదవండి:పక్కా వ్యూహం.. ప్రణాళిక ప్రకారం ప్రచారం