నాగార్జున సాగర్ ఉప ఎన్నిక నేపథ్యంలో నల్గొండ జిల్లా పెద్దవురా మండలం ఉరబాయి తండాలో మంత్రి జగదీశ్ రెడ్డి ప్రచారం నిర్వహించారు. ఆయనతోపాటు ఎమ్మెల్యే బాల్క సుమన్, చిరుమూర్తి లింగయ్య, బడుగుల లింగయ్య యాదవ్, ఎమ్మెల్యే అభ్యర్థి నోముల భగత్, తదితరులు పాల్గొన్నారు.
ఇక ముందు కూడా
దురదృష్టవశాత్తు నోముల నర్సింహయ్య అకాల మరణం చెందడం వల్ల.. ఈ ఉప ఎన్నికలు వచ్చాయని జగదీశ్ రెడ్డి అన్నారు. ఆయన వారసునిగా నోముల కుమారుడు భగత్ను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. జానారెడ్డి ఇన్నాళ్లు చేసింది ఏమీ లేదని.. ఇక ముందు కూడా చేయడని ఎద్దేవా చేశారు. జానారెడ్డి ఏనాడు తండాల వైపు తొంగి చూసి గిరిజనుల బాధలు పట్టించుకోలేదని విమర్శించారు.