తెలంగాణ

telangana

ETV Bharat / state

పిచ్చికుక్కల స్వైర విహారం... ఏడుగురిపై దాడి...

పిచ్చికుక్కలు దాడి చేసి ఏడుగురు తీవ్రంగా గాయపడ్డ ఘటన... నల్గొండ జిల్లా త్రిపురారం మండలంలో చోటుచేసుకుంది. క్షతగాత్రులు మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

By

Published : Oct 9, 2019, 9:18 PM IST

mad-dog-attack-on-seven-villegers

నల్గొండ జిల్లా త్రిపురారం మండలంలో పిచ్చి కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. మూడు గ్రామాల్లో ఏకంగా ఏడుగురిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి. త్రిపురారంలో ఓ వృద్ధురాలిపై దాడి చేశాయి. ముఖంపై తీవ్ర గాయాలైన బాధితురాలిని మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రికి తరలించారు. పిచ్చి కుక్కలు వీధుల వెంట తిరుగుతూ... దాడులు చేస్తున్నాయని గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించి... కుక్కలు అరికట్టాలని ప్రజలు డిమాండ్​ చేస్తున్నారు.

పిచ్చికుక్కల స్వైర విహారం... ఏడుగురిపై దాడి...

ABOUT THE AUTHOR

...view details