తెలంగాణ

telangana

ETV Bharat / state

Lovers sucide: పెళ్లికి నిరాకరించారని.. నిండు ప్రాణాలు తీసుకున్నారు - nalgonda crime news

Lovers sucide in nalgonda district: తల్లిదండ్రులు తమ పెళ్లికి అంగీకరించలేదని ఓ ప్రేమజంట పురుగుల మందు తాగి, చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటన నల్గొండ జిల్లా చందంపేట మండలం కాసరాజుపల్లిలో చోటుచేసుకుంది. తమ చావుకు ఎవరూ కారణం కాదని సూసైడ్ లెటర్​లో రాశారు.

Lovers sucide
Lovers sucide

By

Published : Feb 27, 2023, 3:48 PM IST

Lovers sucide in nalgonda district: ఆ యువతి.. పెద్దవారిని ఒప్పించి తను ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకుందామనుకుంది. తన ప్రేమ విషయాన్ని ముందుగా తల్లికి తెలిపింది. కులాంతర ప్రేమ కావడం వల్ల తల్లి నిరాకరించడంతో తండ్రికి చెప్పడానికి భయపడింది. ప్రేమికులిద్దరూ ఒకరినొకరు వదిలి ఉండటం ఇష్టం లేక చివరకు ఇద్దరు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటన నల్లగొండ జిల్లాలో చోటు చేసుకుంది. చందంపేట మండలం కాసరాజుపల్లి సమీపంలో ప్రేమజంట ఆత్మహత్యకు పాల్పడినట్లు గుర్తించారు. చెట్టుకు వేలాడుతూ విగతజీవులుగా కనిపించడంతో స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.

పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ద్విచక్ర వాహనం, పురుగుల మందు డబ్బా, సూసైడ్ లెటర్‌ను స్వాధీనం చేసుకున్నారు.సూసైడ్ నోట్లు ఇరువురు విడిగా ఒకటి, జంటగా మరొకటి రాసి పెట్టారు. యువతి తన తల్లికి తమ ప్రేమ విషయం చెప్పడంతో రోజు మందలిస్తుండేదని దాంతో విసుగు చెందిన అమ్మాయి చనిపోతా అని అబ్బాయికి చెప్పంది. దీంతో ఇద్దరం కలిసి చనిపోదామని నిర్ణయించుకొని కలిసి ఆత్మహత్యకు పాల్పడ్డారని పోలీసులు సూసైడ్ నోట్​ను చదివిన తరువాత గుర్తించారు.

చనిపోవాలని నిర్ణయించుకున్న తరువాత ద్విచక్ర వాహనంపై కాసరాజుపల్లికి వచ్చిన ప్రేమ జంట పురుగుల మందు తాగి, ఆ తర్వాత తాడుతో చెట్టుకు ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడినట్లు వారు గుర్తించారు. మృతులు రాకేష్, వరికుప్పల దేవిగా పోలీసులు తెలిపారు. రాకేష్‌ది ఎస్సీ కులవర్గం కాగా దేవి బీసీ కులానికి చెందిగా అమ్మాయిగా గుర్తించారు. ఈ ఆత్మహత్యపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు మొదలుపెట్టారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు. పోస్టుమర్టం పూరైన తర్వాత కుటుంబసభ్యులకు మృతదేహాలను అందించారు. ప్రేమ జంట ఆత్మహత్యతో ఇరు కుటుంబాల్లో విషాదం నెలకొంది.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details