నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో తెరాస అధినేత, సీఎం కేసీఆర్ ప్రచార సభ నిర్వహించకుండా ఆపాలన్న పిటిషన్పై ఇంట్లో అత్యవసర విచారణ చేపట్టేందుకు హైకోర్టు నిరాకరించింది. ఇవాళ హైకోర్టుకు ఉగాది సెలవు ఉన్నందున.. అత్యవసర అంశంగా పరిగణించి హౌస్ మోషన్ విచారణ జరపాలని అనుములకు చెందిన రైతులు గోలి సైదిరెడ్డి, శ్రీనివాస్ రెడ్డి హైకోర్టును కోరారు.
సీఎం సభ ఆపాలంటూ హౌస్ మోషన్.. నిరాకరించిన హైకోర్టు - హైకోర్టు తాజా వార్తలు
కరోనా విజృంభిస్తున్న వేళ నాగార్జునసాగర్ అనుములలో సీఎం కేసీఆర్ తలపెట్టిన సభను ఆపాలంటూ కొందరు రైతులు హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ వేశారు. ఈ పిటిషన్పై అత్యవసర విచారణ చేపట్టేందుకు హైకోర్టు నిరాకరించింది.

హైకోర్టు
రైతుల అభ్యర్థనను తోసిపుచ్చిన ఉన్నత న్యాయస్థానం.. హౌస్ మోషన్ అనుమతి నిరాకరించింది. కొవిడ్ నిబంధనలు పట్టించుకోకుండా ఈ నెల 14న అనుములలో తెరాస భారీ సభకు ఏర్పాట్లను చేస్తోందని పిటిషనర్లు పేర్కొన్నారు.