ఈ ఏడాది ఉమ్మడి నల్లొండ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసాయి. నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి జిల్లాలో సగటున నాలుగు మీటర్ల మేర భూగర్భ జలాలు పెరిగినట్లు సంబంధిత శాఖ తెలిపింది. ఈ ఏడాది రాష్ట్రంలోనే అత్యధికంగా యాదాద్రి జిల్లాలో సాధారణ వర్షపాతం కంటే 50 శాతం అధికంగా నమోదయినట్లు తమ నివేదికలో వెల్లడించింది. భారీ వర్షాలతో ఉమ్మడి జిల్లాలోని నాగార్జునసాగర్, మూసీ ప్రాజెక్టులతో పాటు ఇతర మధ్య, చిన్న తరహా ప్రాజెక్టులు, చెరువులు, కుంటలు జలకళను సంతరించుకున్నాయి.
ఈ యాసంగిలో రాష్ట్రంలోనే అత్యధికంగా ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా సుమారు పది లక్షల ఎకరాలకు నీళ్లు ఇవ్వాలని ప్రభుతం నిర్ణయించింది. రెండు తెలుగు రాష్ట్రాలకు ప్రధాన తాగు, సాగు నీటి వనరైన నాగార్జున సాగర్కు ఈదశాబ్దంలోనే భారీగా వరద నీరు వచ్చిందని అధికారులు తెలిపారు.
సాధారణంగా కురావాల్సింది.. కురిసింది