నీరు వృథా చేయకుండా... పొదుపుగా వాడుకోవాలని సూచిస్తూ నల్గొండ పట్టణంలో వివిధ శాఖల ప్రభుత్వ ఉద్యోగులు జలశక్తి అభియాన్ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. పట్టణంలోని నాగార్జున ప్రభుత్వ కళాశాల నుంచి క్లాక్ టవర్ వరకు ర్యాలీ చేపట్టారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ చంద్రశేఖర్, ఏడీఓ శ్రీధర్రెడ్డి, ఆర్డీవో, ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు. గ్రామాల్లో, పట్టణాల్లో ప్రజలు నీరు పొదుపుగా వాడుకోవాలని జాయింట్ కలెక్టర్ చంద్రశేఖర్ అన్నారు.
నీటి పొదుపుపై ఉద్యోగుల ర్యాలీ
నీటి పొదుపు ప్రాముఖ్యతను వివరిస్తూ నల్గొండ జిల్లాలో ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులు అవగాహన ర్యాలీ నిర్వహించారు.
నీటి పొదుపుపై ర్యాలీ