తెలంగాణ

telangana

ETV Bharat / state

'సమాచారం ఇవ్వకుండా గొర్రెల పంపిణీ ఎలా చేశారు'

నల్లగొండ జిల్లాలో త్రిపురారంలో జరిగిన గొర్రెల పంపిణీ కార్యక్రమంలో ప్రోటోకాల్ వివాదం నెలకొంది. పశు వైద్యాధికారి.. తమకు సమాచారం ఇవ్వకుండా కార్యక్రమాన్ని జరిపారంటూ నిడమనూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ మండిపడ్డారు.

By

Published : Mar 22, 2021, 2:13 PM IST

gorrela pampini in Tripuraram, Nalgonda district has sparked controversy
'సమాచారం ఇవ్వకుండా గొర్రెల పంపిణీ ఎలా చేశారు'

నల్గొండ జిల్లా త్రిపురారం మండల కేంద్రంలో జరిగిన గొర్రెల పంపిణీ కార్యక్రమంలో ప్రోటోకాల్ వివాదం నెలకొంది. ప్రజా ప్రతినిధులకు కనీస సమాచారం ఇవ్వకుండా కార్యక్రమాన్ని చేపట్టడంపై.. పశు వైద్యాధికారి శశికళను.. నిడమనూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ జానయ్య నిలదీశారు. తమకు చెప్పకుండా ఎలా పంపిణీ చేశారంటూ.. ఫైర్​ అయ్యారు.

ABOUT THE AUTHOR

...view details