రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఇవాళ నల్గొండ జిల్లా కేంద్రంలో పర్యటించనున్నారు. ఉదయం 11 గంటలకు ప్రైవేటు ఆసుపత్రిని ప్రారంభించిన అనంతరం.. రెడ్ క్రాస్ సొసైటీ నిర్వహించే కార్యక్రమంలో పాల్గొంటారు. మధ్యాహ్నం పన్నెండున్నరకు ప్రఖ్యాత ఛాయా సోమేశ్వరాలయాన్ని సందర్శిస్తారు.
Governor Tamilisai: మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయాన్ని సందర్శించనున్న గవర్నర్ - మహాత్మగాంధీ విశ్వవిద్యాలయం
తొలిసారి ఛాన్స్లర్ హోదాలో గవర్నర్ తమిళిసై నేడు మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయాన్ని సందర్శించనున్నారు. నల్గొండ జిల్లా కేంద్రంలో ఆమె పర్యటించనున్నారు. వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్న అనంతరం గవర్నర్ వర్సిటీలో గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించి బతుకమ్మ వేడుకల్లో పాల్గొననున్నారు.
![Governor Tamilisai: మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయాన్ని సందర్శించనున్న గవర్నర్ Governor Tamilisai](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-13282146-809-13282146-1633561844009.jpg)
Governor Tamilisai
అనంతరం అక్కడి నుంచి బయల్దేరి మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయానికి చేరుకుంటారు. మహాత్మాగాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించిన అనంతరం.. రక్తదాన శిబిరంతోపాటు బతుకమ్మ వేడుకల్లో గవర్నర్ పాల్గొంటారు. ఇందుకు సంబంధించి జిల్లా అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ సందర్భంగా వర్సిటీలో పేరుకుపోయిన సమస్యల పరిష్కారంపై గవర్నర్ దృష్టిసారించాలని విద్యార్థులు కోరుతున్నారు.
ఇదీ చూడండి:Governor Tamilisai: రాజ్భవన్లో బతుకమ్మ పాట.. గవర్నర్ తమిళిసై ఆట!