మార్కెట్ లో డిమాండ్ ఉన్న పంటల్ని సాగు చేస్తేనే రైతులకు ఆదాయం వస్తుందని మంత్రి జగదీశ్రెడ్డి అన్నారు. నూతనంగా అమలు చేయనున్న నియంత్రిత పంటల సాగు, వ్యవసాయ ప్రణాళిక సన్నద్ధతపై.. నల్గొండ కలెక్టరేట్ లో రైతులకు అవగాహన కల్పించారు. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్.. శాస్త్రవేత్తలు, వ్యవసాయ, మార్కెటింగ్ నిపుణులతో చర్చించి నూతన వ్యవసాయ విధానాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నామని స్పష్టం చేశారు.
రైతులకు 24గంటల కరెంట్, నీళ్లు