నల్గొండ జిల్లా త్రిపురారం మండల కేంద్రంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ కొనుగోలు కేంద్రంలో లారీల కొరత కారణంగా గత 3 రోజులుగా తూకం వేసిన ధాన్యం అలాగే నిల్వ ఉండిపోయింది. ఫలితంగా ధాన్యం బస్తాలు ఎండకు ఎండి బస్తాల్లో తరుగు వస్తోందంటూ రైతులు ఆందోళనకు దిగారు. వెంటనే తూకం వేసిన బస్తాలను మిల్లులకు తరలించాలని డిమాండ్ చేశారు.
ధాన్యం తరలించాలంటూ రైతుల ఆందోళన - latest news on Farmers' concern over grain moving
త్రిపురారంలోని ధాన్యం కొనుగోలు కేంద్రం ఎదుట రైతులు ఆందోళనకు దిగారు. తూకం వేసిన ధాన్యాన్ని మిల్లులకు తరలించాలంటూ డిమాండ్ చేశారు.
![ధాన్యం తరలించాలంటూ రైతుల ఆందోళన Farmers' concern over grain moving](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6784786-40-6784786-1586846667565.jpg)
ధాన్యం తరలించాలంటూ రైతుల ఆందోళన
బస్తాలు తూకం వేసి.. మిల్లులకు పంపకపోవడం వల్ల 3 రోజులుగా కొనుగోలు కేంద్రం వద్ద కాపలా ఉండాల్సి వస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే సంబంధిత అధికారులు స్పందించి ధాన్యాన్ని తరలించాలని కోరుతున్నారు.
ఇవీ చూడండి:మామకు కరోనా పాజిటివ్... అల్లుడిపై కేసు