తెలంగాణ

telangana

ETV Bharat / state

రంజాన్ పురస్కరించుకుని సేమియా కిట్ల పంపిణీ

మిర్యాలగూడ పట్టణంలోని హ్యూమన్ రైట్స్ డిఫెండర్ సంస్థ.. స్థానిక పేద ముస్లింలకు సేమియా కిట్లను పంపిణీ చేసింది. రంజాన్ మాసంలో పేదలకు సహాయం అందించేందుకు దాతలు, స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలని సంస్థ అధ్యక్షుడు హమీద్ షేక్ కోరారు. 

By

Published : May 5, 2021, 3:47 PM IST

రంజాన్ 2021
రంజాన్ 2021

రంజాన్​ను పురస్కరించుకుని మిర్యాలగూడ పట్టణంలోని హౌసింగ్ బోర్డ్ కాలనీలో.. హ్యూమన్ రైట్స్ డిఫెండర్ సంస్థ ముస్లింలకు సేమియా కిట్లను పంపిణీ చేసింది. అమెరికాలో స్థిరపడ్డ దాత సురేశ్​ కుమార్​కు.. సంస్థ అధ్యక్షుడు హమీద్ షేక్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. రంజాన్ మాసంలో పేదలకు సహాయం అందించేందుకు దాతలు, స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలని ఆయన కోరారు.

ABOUT THE AUTHOR

...view details