తెలంగాణ

telangana

ETV Bharat / state

డీసీఎం బోల్తా... 12 మంది కూలీలకు గాయాలు - ACCIDENT NEWS IN NALGONDA

నల్గొండి జిల్లా కోతులారం వద్ద జరిగిన ప్రమాదంలో గాయపడిన ఎనిమిది మందిని హైదరాబాద్​ తరలించారు. కొత్తపేటలోని సాయిసంజీవని ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఇద్దరు కూలీల పరిస్థితి విషమంగా ఉంది.

DCM ACCIDENT AT NALGONDA DISTRICT DAULY LABOURS INJURED

By

Published : Nov 10, 2019, 10:28 PM IST

Updated : Nov 10, 2019, 10:48 PM IST

నల్గొండ ప్రమాద బాధితుల్లో ఇద్దరి పరిస్థితి విషమం...

నల్లగొండ జిల్లా మునుగోడు మండలంలోని పలివేల, కోతులరాం గ్రామాల మధ్య ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కొంపల్లిలో పత్తి నింపుకొని వస్తున్న డీసీఎం ఎదురుగా వస్తున్న ద్విచక్రవహానాన్ని తప్పించబోయి... బోల్తాపడింది. ఈ ప్రమాదంలో డీసీఎంలో ఉన్న 12 మంది కూలీలు గాయపడ్డారు. ఎనిమిది మందికి తీవ్ర గాయాలు కాగా... హైదరాబాద్​కు తరలించారు. ఇద్దరి పరిస్థితి తీవ్ర విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. బోయ యాదయ్య చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడని తెలిపారు. మిగతా వారి పరిస్థితి 24 గంటలు గడిస్తే గానీ ఏం చెప్పలేమంటున్నారు. కూలీలంతా కిష్టాపురం గ్రామానికి చెందిన రోజువారి కూలీలుగా గుర్తించారు. డ్రైవర్​ అతివేగమే ప్రమాదానికి కారణమని క్షతగాత్రులు తెలిపారు.

Last Updated : Nov 10, 2019, 10:48 PM IST

ABOUT THE AUTHOR

...view details