తెలంగాణ

telangana

ETV Bharat / state

'కేంద్రం కార్పొరేట్​ శక్తులకు కొమ్ము కాస్తోంది'

కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్​ శక్తులకు కొమ్ముకాస్తోందని భువనగిరి సీపీఐ ఎంపీ అభ్యర్థి గోదా శ్రీరాములు ఆరోపించారు. నల్గొండ జిల్లా చిట్యాల, రామన్నపేట రోడ్​ షోలో పాల్గొన్నారు.

By

Published : Apr 8, 2019, 2:19 PM IST

గోదా శ్రీరాములు

గత ఐదేళ్లలో తెరాస ఎంపీలు చేసిందేమీలేదని భువనగిరి సీపీఐ ఎంపీ అభ్యర్థి గోదా శ్రీరాములు అన్నారు. నల్గొండ జిల్లా చిట్యాల, రామన్నపేటలో జరిగిన రోడ్​ షోకు హాజరయ్యారు. మోదీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తోందని విమర్శించారు. కేంద్రప్రభుత్వం కార్పొరేట్​ శక్తులకు కొమ్ముకాస్తున్నారని ఆరోపించారు. ఈ ఎన్నికల్లో వామపక్షాలు విజయం సాధిస్తాయని ధీమా వ్యక్తం చేశారు.ఇవీ చూడండి: బర్త్​డే బాయ్​​ సరసన రష్మిక మందణ్న

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details