'కేంద్రం కార్పొరేట్ శక్తులకు కొమ్ము కాస్తోంది' - cpi
కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు కొమ్ముకాస్తోందని భువనగిరి సీపీఐ ఎంపీ అభ్యర్థి గోదా శ్రీరాములు ఆరోపించారు. నల్గొండ జిల్లా చిట్యాల, రామన్నపేట రోడ్ షోలో పాల్గొన్నారు.
!['కేంద్రం కార్పొరేట్ శక్తులకు కొమ్ము కాస్తోంది'](https://etvbharatimages.akamaized.net/etvbharat/images/768-512-2937185-thumbnail-3x2-cpi.jpg)
గోదా శ్రీరాములు
గత ఐదేళ్లలో తెరాస ఎంపీలు చేసిందేమీలేదని భువనగిరి సీపీఐ ఎంపీ అభ్యర్థి గోదా శ్రీరాములు అన్నారు. నల్గొండ జిల్లా చిట్యాల, రామన్నపేటలో జరిగిన రోడ్ షోకు హాజరయ్యారు. మోదీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తోందని విమర్శించారు. కేంద్రప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు కొమ్ముకాస్తున్నారని ఆరోపించారు. ఈ ఎన్నికల్లో వామపక్షాలు విజయం సాధిస్తాయని ధీమా వ్యక్తం చేశారు.ఇవీ చూడండి: బర్త్డే బాయ్ సరసన రష్మిక మందణ్న