తెలంగాణ

telangana

ETV Bharat / state

'పనులు ప్రారంభించి ఐదేళ్లు గడుస్తున్నా... పరిహారమేది?'

డిండి ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మిస్తున్న కిష్టారాయిన్​పల్లి ప్రాజెక్టులో నల్గొండ జిల్లాలోని నాంపల్లి లక్ష్మణపల్లి ముంపునకు గురవుతోంది. పనులు ప్రారంభించి... ఐదేళ్లు గడుస్తున్నా... పరిహారం అందించలేదని స్థానికులు ఆందోళన చేపట్టారు.

By

Published : Feb 16, 2021, 10:05 AM IST

'పనులు ప్రారంభించి ఐదేళ్లు గడుస్తున్నా... పరిహారమేది?'
'పనులు ప్రారంభించి ఐదేళ్లు గడుస్తున్నా... పరిహారమేది?'

నల్గొండ జిల్లా లక్ష్మణపురం గ్రామస్థులు ఆందోళనకు దిగారు. డిండి ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మిస్తున్న కిష్టారాయిన్​పల్లి ప్రాజెక్టులో నాంపల్లి మండలంలోని లక్ష్మణపల్లి ముంపునకు గురవుతోంది. ప్రాజెక్టు పనులు ప్రారంభించి... ఐదేళ్లు గడుస్తున్నా... ఇప్పటివరకు పరిహారం అందించలేదని స్థానికులు ఆందోళన చేపట్టారు.

ఆర్అండ్ఆర్ ప్యాకేజీ ఇవ్వకుండా పోలీసు బలగాలు మోహరించి పనులు నిర్వహిస్తున్నారని నిర్వాసితులు ఆవేదన వెలిబుచ్చారు. ప్రాజెక్టు పనులను అడ్డుకున్నారు. నిర్వాసితులందరికీ... ప్రభుత్వం వెంటనే పరిహారం అందించాలని గ్రామస్థులు కోరుతున్నారు.

ఇదీ చదవండి :ఆ రోజుకోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నా: కేటీఆర్

ABOUT THE AUTHOR

...view details