సీఎం కేసీఆర్ అసమర్థ పాలన వల్లే నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ మంత్రి విజయ రామారావు ఆరోపించారు. సునీల్ నాయక్, మహేందర్, రవిల మరణాలకు తెరాస ప్రభుత్వం బాధ్యత వహించాలన్నారు. బీజేవైయం నాయకులతో కలసి నల్గొండ జిల్లా హాలియా ఎస్ఆర్ ఫంక్షన్ హాల్లో సమావేశం ఏర్పాటు చేశారు.
నిరుద్యోగులకు భృతి ఇవ్వ కుండా సాగర్ ఉపఎన్నికలో ఎలా ఓట్లు అడుగుతారని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ తాగిన మైకంలో హామీలిచ్చి... మర్చిపోయాడని విమర్శించారు. సీఎంగా దళితులకు అవకాశం ఇస్తానని చెప్పి మాట తప్పారని ఆరోపించారు.