నల్గొండ-ఖమ్మం-వరంగల్ నియోజకవర్గ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు తొలిరోజు నల్గొండ జిల్లాలో ఒక్క నామినేషన్ మాత్రమే నమోదైంది. స్వతంత్ర అభ్యర్థిగా బండారు నాగరాజు నామినేషన్ పత్రాన్ని జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్కు అందజేశారు.
తొలిరోజు పట్టభద్రుల ఎమ్మెల్సీకి ఒకే నామినేషన్ - ఎమ్మెల్సీ ఎన్నికల మొదటి రోజు కేవలం ఒక్కరు నామినేషన్
వచ్చేనెల 14న జరగనున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల పర్వం మొదలైంది. మొదటి రోజు కేవలం ఒక్కరు మాత్రమే నామినేషన్ దాఖలు చేశారు. నల్గొండ-ఖమ్మం-వరంగల్ ఎమ్మెల్సీ స్వతంత్ర అభ్యర్థిగా నల్గొండ జిల్లాలో బండారు నాగరాజు నామినేషన్ పత్రం సమర్పించారు.
నామినేషన్ పత్రాన్ని కలెక్టర్కు అందజేస్తున్న స్వతంత్ర అభ్యర్థి
నల్గొండ స్థానానికి రిటర్నింగ్ అధికారిగా జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ వ్యవహరించనున్నారు. ఈ రోజు నుంచి ఈ నెల 23 వరకు నామినేషన్లు స్వీకరించడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. ఈనెల 24న నామినేషన్ల పరిశీలన, 26న నామినేషన్ల ఉపసంహరణ గడువున్నట్లు వెల్లడించారు. మార్చి 14న పోలింగ్.. 17న ఓట్ల లెక్కింపు నిర్వహించనున్నారు.