తెలంగాణ

telangana

By

Published : Apr 6, 2021, 10:55 AM IST

ETV Bharat / state

ఇంటింటికి తిరుగుతూ ఎమ్మెల్యేల ప్రచారం

సాగర్ ఉప ఎన్నిక దగ్గర పడుతోన్న వేళ.. ప్రచార జోరు ఊపందుకుంది. మాడుగుల పల్లి మండలంలో.. ఎమ్మెల్యేలు ఇంటింటికి తిరుగుతూ ఓట్లని అభ్యర్థిస్తున్నారు. కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరుతున్నారు.

Sagar by-elections
సాగర్ ఉప ఎన్నిక

సీఎం కేసీఆర్.. అన్ని వర్గాలకు న్యాయం చేయడంలో ముందుంటారని తెరాస ఎమ్మెల్యే జీవన్ రెడ్డి కొనియాడారు. గతంలో ఎలాంటి అభివృద్ధి చేయని వారిని ఎన్నికల్లో గెలిపించినా.. లాభముండదంటూ విమర్శించారు. కారు గుర్తుకు ఓటేసి.. అభ్యర్థి నోముల భగత్​ను గెలిపించాల్సిందిగా ఆయన కోరారు. మాడుగులపల్లి మండలం కన్నెకల్​లో.. ఎమ్మెల్యే ఫైళ్ల శేఖర్ రెడ్డితో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు.

తెరాస ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలే.. అభ్యర్థి నోముల భగత్​ను గెలిపిస్తాయని ఫైళ్ల శేఖర్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ప్రచారంలో పార్టీ కార్యకర్తలు.. పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

ఇదీ చదవండి:24 గంటల్లో రికార్డుస్థాయిలో కరోనా కేసులు

ABOUT THE AUTHOR

...view details