తెలంగాణ

telangana

ETV Bharat / state

అకాల వర్షం- అన్నదాతకు కష్టం - అకాల వర్షం- అన్నదాతకు కష్టం

ఇవాళ నల్గొండ జిల్లాల్లో అకాల వర్షం బీభత్సం సృష్టించింది. వర్షం కారణంగా నకిరేకల్ వ్యవసాయ మార్కెట్ యార్డ్​లో 200 క్వింటాళ్ల వరి ధాన్యం తడిసి ముద్దయింది. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.

నకిరేకల్ వ్యవసాయ మార్కెట్లో తడిసిన ధాన్యం

By

Published : Apr 17, 2019, 11:26 PM IST

నల్గొండ జిల్లా నకిరేకల్ వ్యవసాయ మార్కెట్లో బుధవారం కురిసిన అకాల వర్షానికి 200 క్వింటాళ్ల వరి ధాన్యం తడిసింది. దీనివల్ల రైతులు ఆందోళనకు గురయ్యారు. అధికారులు కొనుగోళ్లను వెంట, వెంటనే పూర్తి చేయాలని కోరారు. ధాన్యంపై కప్పటానికి తగిన పరదాలను అందుబాటులో ఉంచాలని డిమాండ్ చేశారు.

నకిరేకల్ వ్యవసాయ మార్కెట్లో తడిసిన ధాన్యం

ABOUT THE AUTHOR

...view details