తెలంగాణ

telangana

ETV Bharat / state

A family need for help: భర్త, బిడ్డపై క్యాన్సర్​ పంజా.. దాతల సాయం అర్థిస్తున్న గృహిణి - దాతల సాయం కోరుతున్న క్యాన్సర్​ బాధిత కుటుంబం

A family need for help: భార్య, భర్త... డిగ్రీ చేసిన కుమార్తె, ఇంజినీరింగ్ చదివిన కుమారుడు... ఉన్నంతలో సంతోషంగా గడుపుతున్న ఆ కుటుంబాన్ని క్యాన్సర్​ మహమ్మారి అతలాకుతలం చేసింది. పెళ్లిచేసి మెట్టినింటికి పంపుదామనుకున్న కుమార్తెకు క్యాన్సర్​ సోకడంతో ఆమెకు చికిత్స చేయించారు. బిడ్డ దక్కింది అనుకునేంతలో ఇంటి పెద్దకు సోకింది. అప్పటివరకు హాయిగా సాగిపోయిన వారి జీవితం ఆర్థిక కష్టాల్లో చిక్కుకుంది. బిడ్డ, భర్తకు శస్త్ర చికిత్స అనంతరం వారిని చంటిబిడ్డలా సాకాల్సిన పరిస్థితి. ఆదాయమార్గం లేకపోవడంతో వైద్య ఖర్చులతో పాటు, పూటగడవడం కూడా కష్టంగా మారిందని ఆవేదన వ్యాక్తం చేస్తోంది ఆ గృహిణి. తమ ఇబ్బందిని చూసి దాతలు సాయం చేయాలని కోరుకుంటోంది మిర్యాలగూడ శాంతినగర్​కు చెందిన పద్మజ.

g for financial assistance
g for financial assistance

By

Published : Feb 3, 2022, 7:41 AM IST

పెళ్లీడుకొచ్చిన బిడ్డకు సంబంధాలు చూడడం మొదలు పెట్టాము. కొద్దిగా అనారోగ్యంగా అనిపిస్తే వైద్యం చేయించాము. తగ్గింది అనుకునేలోపే మరళా తిరగబెట్టింది. పరీక్షలు చేయించగా క్యాన్సర్​ అని తెలిసింది. అదికూడా రెండో దశలో ఉండడం వల్ల ఆపరేషన్​ చేయాలని వైద్యులు చెప్పడంతో శస్త్ర చికిత్స చేయించాము. బిడ్డ కోలుకుంది అనేలోగా.. ఆ క్యాన్సర్​ మహమ్మారి మా వారికి సోకింది. ఇన్నాళ్లు ఆయన సంపాదనతోనే ఇంటిని నడుపుకుంటూ ఇద్దరి బిడ్డలను పెద్ద చేశాను. ఆయన మంచాన పడడంతో పూటగడవడం కూడా కష్టంగా మారింది. ఓవైపు కుటుంబాన్ని నెట్టుకురావడం, మరోవైపు భర్త, కుమార్తెకు మందుల ఖర్చులు.. అన్ని వైపులా ఇబ్బందుల సుడిగుండంలో చిక్కుకున్నాము. ఆర్థికంగా సతమతమవుతోన్న వారి కుటుంబ పరిస్థితిపై దాతలు స్పందించి సాయం చేయాలని అర్థిస్తోంది నల్గొండ జిల్లా మిర్యాలగూడెం శాంతినగర్​కు చెందిన ఆనబత్తుల పద్మజ.

A family need for help: భర్త, బిడ్డపై క్యాన్సర్​ పంజా.. దాతల సాయం అర్థిస్తున్న గృహిణి

A family need for help : మిర్యాలగూడ శాంతినగర్​కు చెందిన ఆనబత్తుల యాదగిరి, పద్మజ దంపతులకు మౌనిక, ముఖేష్​ సంతానం. యాదగిరి ఓ వస్త్ర దుకాణంలో గుమస్తాగా పనిచేస్తుండగా.. పద్మజ ఏఎన్​ఎంగా (ఒప్పంద)పనిచేస్తుంది. వీరి కుమారుడు ఇంజినీరింగ్​ వరకు చదివి ఓ ప్రైవేటు సంస్థలో ఉద్యోగం చేస్తుండగా.. కుమార్తె డిగ్రీ పూర్తి చేసింది. ఉన్నంతలో చింతలేకుండా హాయిగా సాగిపోతున్న వారి కుటుంబంపై క్యాన్సర్​ మహమ్మారి పంజా విసిరింది. పెళ్లి చేసి అత్తవారింటికి పంపుదామనుకున్న కుమార్తెను ఆస్పత్రిపాలు చేసింది.

డిగ్రీ పూర్తి చేసి పీజీ చదువుతున్న మౌనికకు పెళ్లి చేసేందుకు 2017 ఆమె తల్లిదండ్రులు నిశ్చయించారు. సంబంధాలు చూడడం మొదలు పెట్టారు. అయితే ఆమెకు నాలుకపై చిన్న కురుపు రావడంతో వైద్యులను సంప్రదించారు. మందులు వాడగా... తగ్గినట్టే తగ్గి మరలా తిరగబెట్టింది. పరీక్షలు చేయించగా... క్యాన్సర్​ రెండో దశలో ఉన్నట్లు తేలింది. ఈ వార్తతో సంతోషంగా వారి ఉన్న కుటుంబం పెద్ద కుదుపునకు లోనయ్యింది. వైద్యుల సలహాలతో ఆమెకు శస్త్రచికిత్స చేయించారు. ఆమె క్యాన్సర్​ను జయించింది కానీ.. మాట సక్రమంగా రాలేదు సరికదా.. వైద్యులు మరింత జాగ్రత్తగా చూడాలని చెప్పడం వల్ల గాజుబొమ్మవలె సాకుతూ వస్తున్నారు.

భర్త, కుమార్తెతో పద్మజ

నాకు 2017లో క్యాన్సర్​ వచ్చింది. ఆపరేషన్​ చేశారు. ఇప్పుడు మాట్లాడేందుకు కూడా కష్టంగా ఉంది. బాగా చదువుకుని ఉద్యోగం చేసి తల్లిదండ్రులను సంతోషంగా చూసుకుందాం అనుకున్నాను. ఇప్పుడు నన్నే వాళ్లు చంటి పిల్లలూ చూసుకోవాల్సిన పరిస్థితి. ఎవరైనా దాతలు స్పందించి ఆర్థికంగా సాయపడాలని కోరుతున్నాము. మౌనిక

బిడ్డ ప్రాణాలతో దక్కింది.. ఇప్పుడిప్పుడే కుదుటపడుతున్నారు అనుకుంటున్న సమయంలో మరో పిడుగులాంటి వార్త వినిపించింది. గతేడాది డిసెంబర్​లో యాదిగిరికి దవడ లోపల కురుపు రావడంతో పరీక్షలు చేయించగా క్యాన్సర్​ అని తేలింది. అప్పటికే ఆర్థికంగా.. మానసికంగా కుంగిపోయిన ఆ కుటుంబం ఆ వార్తతో మరింత కుదేలైంది. వెంటనే శస్త్ర చికిత్స చేయాలని చెప్పడంతో ఉన్నదంతా ఖర్చుచేసి ఆపరేషన్​ చేయించారు. ప్రస్తుతం అతడిని చంటిబిడ్డలాగే చూసుకోవాల్సిన పరిస్థితి.

భర్త, కుమార్తె క్యాన్సర్​ బారిన పడడంతో ఆర్థికంగా చితికిపోయామని.. వారి వైద్య ఖర్చులతో పాటు పూటగడవడానికి ఇబ్బందిగా ఉందని పద్మావతి కన్నీటి పర్యంతమవుతోంది. ప్రభుత్వం, దాతలు స్పందించి తోచిన సాయం చేయాలని అశ్రునయనాలతో అర్థిస్తోంది.

ఇదీ చూడండి:ఈనాడు కథనానికి స్పందన.. నిరుపేద వైద్య విద్యార్థినికి ఆర్థికసాయం

ABOUT THE AUTHOR

...view details