తెలంగాణ

telangana

ETV Bharat / state

రెండో ప్రాధాన్యతలో పల్లా రాజేశ్వర్‌రెడ్డికి 144 ఓట్లు జమ - నల్గొండ జిల్లా తాజా వార్తలు

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల లెక్కింపు కొనసాగుతోంది. ఎలిమినేషన్ అభ్యర్థుల ఓట్లు తొలి 3 స్థానాల్లోని అభ్యర్థులకు జమ చేశారు. పల్లా రాజేశ్వర్​ రెడ్డికి 144 ఓట్లు, తీన్మార్​ మల్లన్నకు 132 ఓట్లు, కోదండరామ్‌కు 143 ఓట్లు జమ చేశారు.

10 members eliminated from mlc counting
రెండో ప్రాధాన్యతలో కోదండరామ్​కు 127 ఓట్లు జమ

By

Published : Mar 19, 2021, 8:55 AM IST

Updated : Mar 19, 2021, 12:58 PM IST

నల్గొండ-ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపులో.. ఎలిమినేషన్ కార్యక్రమం కొనసాగుతోంది. ఇప్పటి వరకు... 36 మంది అభ్యర్థులను ఎలిమినేషన్ చేశారు. ఎలిమినేషన్ అభ్యర్థుల ఓట్లు తొలి 3 స్థానాల్లోని అభ్యర్థులకు జమ చేశారు. పల్లా రాజేశ్వర్​ రెడ్డికి 144 ఓట్లు, తీన్మార్​ మల్లన్నకు 132 ఓట్లు, కోదండరామ్‌కు 143 ఓట్లు జమ చేశారు. రెండో ప్రాధాన్యత ఓట్ల జమ తర్వాత పల్లా రాజేశ్వర్ రెడ్డికి 1,10,984 ఓట్లు, తీన్మార్‌ మల్లన్నకు 83,422 ఓట్లు, కోదండరాంకు 70,215 ఓట్లు ఉన్నాయి. ఇప్పటివరకు ఎలిమినేషన్ పూర్తయిన అభ్యర్థుల్లో ఒక్కొక్కరికి వచ్చిన మొత్తం ఓట్లు... 10 నుంచి 15 లోపు ఓట్లు మాత్రమే ఉన్నాయి. ఇలా పోలై, చెల్లబాటు అయిన ఓట్లలో సగం కంటే ఎక్కువ వచ్చే వరకు ఇలా ఎలిమినేషన్​ ప్రక్రియ కొనసాగుతుంది.

ఎవరికెన్ని రావాలి..

పల్లా రాజేశ్వర్ రెడ్డి గెలుపొందాలంటే 72,327 ఓట్లు రావాలి. తీన్మార్ మల్లన్నకు 99,877 ఓట్లు, కోదండరామ్​కు 1,13,095 ఓట్లు కావాలి. మొదటి ప్రాధాన్యత ఓట్లలో పల్లాకు 1,10,840, తీన్మార్​ మల్లన్నకు 83,290, కోదండరాంకు 70,072 ఓట్లు వచ్చాయి. అభ్యర్థి విజయానికి 1,83,167 ఓట్లు కావాలి

మొదటి ప్రాధాన్యత ఓట్లు

అభ్యర్థి తొలి ప్రాధాన్యం రెండో ప్రాధాన్యతతో కలిపి
పల్లా రాజేశ్వర్ రెడ్డి 1,10,840 1,10,984
తీన్మార్ మల్లన్న 83,290 83,422
కోదండరామ్‌ 70,072 70,215

ఇదీ చదవండి:ఆరో రౌండ్ లెక్కింపు​ పూర్తి.. ఆధిక్యంలో సురభి వాణీదేవి

Last Updated : Mar 19, 2021, 12:58 PM IST

ABOUT THE AUTHOR

...view details