నాగర్కర్నూల్ జిల్లా వ్యాప్తంగా రబీలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ధాన్యాన్ని కొనుగోలు చేయాలని అధికారులను కలెక్టర్ శ్రీధర్ ఆదేశించారు. వ్యవసాయ అధికారులు, మిల్లర్లలతో కలెక్టర్ సమావేశమయ్యారు. కొనుగోలు కేంద్రాల వద్ద తాగునీరు, పరదాలు ఏర్పాటు చేయాలని సూచించారు. తేమ కొలిచే యంత్రాలు, ఎలక్ట్రానిక్ తూకాలు, టార్ఫాలిన్లు అందుబాటులో ఉంచాలని స్పష్టం చేశారు. ధాన్యాన్ని మిల్లర్లకు అప్పగించిన వెంటనే రసీదులు తీసుకోవాలన్నారు. రైతులకు 48 గంటల్లోనే నగదు అందించాలని సూచించారు.
రైతులను ఇబ్బంది పెడితే బ్లాక్ లిస్ట్లో పెడతాం - collector sridhar
రబీలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోలు చేయాలని నాగర్కర్నూల్ జిల్లా కలెక్టర్ శ్రీధర్ అధికారులను ఆదేశించారు. కొనుగోలు కేంద్రాల్లో కనీస వసతులు కల్పించాలని సూచించారు.

రైతులను ఇబ్బంది పెడితే బ్లాక్ లిస్ట్లో పెడతాం
రైతులను ఇబ్బంది పెడితే బ్లాక్ లిస్ట్లో పెడతాం
అచ్చంపేటలో కొన్ని ఇబ్బందులు ఉన్నట్లు తన దృష్టికి వచ్చిందని, రైతులను అవస్థలకు గురిచేస్తే ఆయా సంస్థలను బ్లాక్ లిస్ట్లో పెడతామని హెచ్చరించారు. ఈ సమావేశంలో సంయుక్త కలెక్టర్ శ్రీనివాస్రెడ్డి, జిల్లా రైస్ మిల్లర్ల అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.
ఇవీ చూడండి: పంటల బీమా గడువు ఖరారు చేసిన వ్యవసాయశాఖ