తెలంగాణ

telangana

ETV Bharat / state

నాగర్​కర్నూల్​లో అనుమతి లేని లేఅవుట్లపై కన్నెర్ర

నాగర్​కర్నూల్​ జిల్లాలో అనుమతులు లేకుండా వ్యవసాయ భూములను లేఅవుట్లుగా మార్చి విక్రయిస్తున్న వారిపై అధికారులు కన్నెర్రచేశారు. ఆయా భూముల్లో ఉన్న కొలత రాళ్లను తొలగించి, అటువంటి స్థలాలకు రిజిస్ట్రేషన్లు చేయొద్దని రెవెన్యూ అధికారులకు సమాచారమిచ్చారు.

By

Published : Mar 20, 2019, 9:04 PM IST

అనుమతి లేని లేఅవుట్లపై కన్నెర్ర

అనుమతి లేని లేఅవుట్లపై కన్నెర్ర
నాగర్​ కర్నూల్​ జిల్లా కల్వకుర్తిలో పురపాలక నిబంధనలకు విరుద్ధంగా స్థలాలు విక్రయిస్తున్న వెంచర్లపై అధికారులు చర్యలకు ఉపక్రమించారు. అనుమతి లేకుండా వ్యవసాయ భూమిలో ఏర్పాటుచేసిన లేఅవుట్లలో కొలత రాళ్లను తొలగించి, అలాంటి భూముల రిజిస్ట్రేషన్లు చేయవద్దని రెవెన్యూ అధికారులకు సూచించారు.

రిజిస్ట్రేషన్లు చేయం

కల్వకుర్తిలోని పలు ప్రాంతాల్లో పురపాలక అధికారుల అనుమతులు లేకుండా వ్యవసాయ భూములను ఇళ్ల స్థలాలుగా మార్చి విక్రయిస్తున్నారు. అక్కడ కొనుగోలు చేసిన వారు భవన నిర్మాణాల కోసం అధికారుల వద్దకు వెళ్తే ఆ భూములను రిజిస్ట్రేషన్​ చేసేందుకు నిరాకరిస్తున్నారు. ఆందోళనకు గురైన స్థలాల యజమానులు పట్టణ ప్రణాళిక అధికారులకు ఫిర్యాదు చేశారు.

పురపాలక చట్టాలకు వ్యతిరేకంగా ఎలాంటి వెంచర్లు ఏర్పాటు చేసినా.. చర్యలు తీసుకుంటామని పట్టణ ప్రణాళిక అధికారులు ​ హెచ్చరించారు.

ఇవీ చూడండి:ప్రయాణికులకు అందుబాటులోకి వచ్చిన హై'టెక్​' మెట్రో

ABOUT THE AUTHOR

...view details