నాగర్ కర్నూల్ జిల్లా మాదారం గ్రామంలో జాతీయ బీసీ కమిషన్ సభ్యుడు తల్లోజు ఆచారి ఆధ్వర్యంలో భాజపా నాయకులు నిత్యావసర సరకుల పంపిణీ చేశారు. లాక్డౌన్ను ప్రతి ఒక్కరూ దృష్టిలో ఉంచుకొని ఇంట్లోనే ఉండాలని తెలిపారు. పేదలకు ఇబ్బందులు కలగకుండా భాజపా ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు విస్తృతం చేయాలని కార్యకర్తలకు సూచించారు. నిరుపేదలను ఆదుకునేందుకు దాతలు అధిక సంఖ్యలో ముందుకు రావాలని ఆయన ఈ సందర్భంగా కోరారు. కార్యక్రమంలో భాజపా కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.