తెలంగాణ

telangana

ETV Bharat / state

కన్నుల పండువగా సిరిసనగండ్ల శ్రీ సీతారాముల కల్యాణం - నాగర్‌కర్నూల్‌లో సీతారాముల కల్యాణం

నాగర్ కర్నూల్ జిల్లా చారకొండ మండలంలోని సిరిసనగండ్ల శ్రీ సీతారాముల దేవాలయంలో కుంభాభిషేక మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. రెండో భద్రాద్రిగా పిలిచే ఈ ఆలయానికి ఎంతో చరిత్ర ఉందని అర్చకులు తెలిపారు. ఈ మహోత్సవంలో భాగంగా రామచంద్ర స్వామి, సీతమ్మ తరఫున గ్రామస్థులు ఉండి కల్యాణం జరిపించారు.

sirasanagandla sri seetharamula kalyanam in nagar kurnool
కన్నుల పండువగా సిరిసనగండ్ల శ్రీ సీతారాముల కల్యాణం

By

Published : Oct 11, 2020, 5:32 PM IST

నాగర్ కర్నూల్ జిల్లా చారకొండ మండలంలోని సిరిసనగండ్ల శ్రీ సీతారాముల దేవాలయంలో కుంభాభిషేక మహోత్సవం కన్నుల పండువగా నిర్వహించారు. రెండో భద్రాద్రిగా పిలిచే ఈ ఆలయానికి ఎంతో చరిత్ర ఉందని అర్చకులు తెలిపారు. శ్రీ సీతారామచంద్ర స్వామి కల్యాణ మహోత్సవంలో భాగంగా సిరసనగండ్ల గ్రామ పెద్దలు వరుడు రామచంద్ర స్వామి, వధువు సీతమ్మ తరుఫున పెళ్లి పెద్దలుగా ఉండి కల్యాణం జరిపారు.

ఈ మహోత్సవంలో జాతీయ బీసీ కమిషన్ సభ్యుడు తల్లోజు ఆచారి, జడ్పీ వైస్ ఛైర్మన్ బాలాజీ సింగ్, డీసీసీ అధ్యక్షుడు వంశీకృష్ణ, ఆలయ అర్చకులు, ప్రజా ప్రతినిధులు, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి:వర్షాన్ని లెక్కచేయకుండా యాదాద్రికి పోటెత్తిన భక్తులు

ABOUT THE AUTHOR

...view details