నాగర్ కర్నూల్ జిల్లా చారకొండ మండలంలోని సిరిసనగండ్ల శ్రీ సీతారాముల దేవాలయంలో కుంభాభిషేక మహోత్సవం కన్నుల పండువగా నిర్వహించారు. రెండో భద్రాద్రిగా పిలిచే ఈ ఆలయానికి ఎంతో చరిత్ర ఉందని అర్చకులు తెలిపారు. శ్రీ సీతారామచంద్ర స్వామి కల్యాణ మహోత్సవంలో భాగంగా సిరసనగండ్ల గ్రామ పెద్దలు వరుడు రామచంద్ర స్వామి, వధువు సీతమ్మ తరుఫున పెళ్లి పెద్దలుగా ఉండి కల్యాణం జరిపారు.
కన్నుల పండువగా సిరిసనగండ్ల శ్రీ సీతారాముల కల్యాణం - నాగర్కర్నూల్లో సీతారాముల కల్యాణం
నాగర్ కర్నూల్ జిల్లా చారకొండ మండలంలోని సిరిసనగండ్ల శ్రీ సీతారాముల దేవాలయంలో కుంభాభిషేక మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. రెండో భద్రాద్రిగా పిలిచే ఈ ఆలయానికి ఎంతో చరిత్ర ఉందని అర్చకులు తెలిపారు. ఈ మహోత్సవంలో భాగంగా రామచంద్ర స్వామి, సీతమ్మ తరఫున గ్రామస్థులు ఉండి కల్యాణం జరిపించారు.
![కన్నుల పండువగా సిరిసనగండ్ల శ్రీ సీతారాముల కల్యాణం sirasanagandla sri seetharamula kalyanam in nagar kurnool](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9136440-414-9136440-1602415257447.jpg)
కన్నుల పండువగా సిరిసనగండ్ల శ్రీ సీతారాముల కల్యాణం
ఈ మహోత్సవంలో జాతీయ బీసీ కమిషన్ సభ్యుడు తల్లోజు ఆచారి, జడ్పీ వైస్ ఛైర్మన్ బాలాజీ సింగ్, డీసీసీ అధ్యక్షుడు వంశీకృష్ణ, ఆలయ అర్చకులు, ప్రజా ప్రతినిధులు, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి:వర్షాన్ని లెక్కచేయకుండా యాదాద్రికి పోటెత్తిన భక్తులు