తెలంగాణ

telangana

ETV Bharat / state

పురుగుల మందు తాగిన ఆర్టీసీ కార్మికుడు

మరో ఆర్టీసీ కార్మికుడు ఆత్మహత్యాయత్నానికి ఒడిగట్టాడు. నాగర్​కర్నూల్ జిల్లాలో ఆర్టీసీ డ్రైవర్​గా విధులు నిర్వర్తిస్తున్న ఖాజా పురుగుల మందు తాగాడు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉంది.

By

Published : Nov 1, 2019, 4:43 PM IST

పురుగుల మందు తాగిన ఆర్టీసీ కార్మికుడు

నాగర్​కర్నూల్ జిల్లాలో మరో ఆర్టీసీ కార్మికుడు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. షాద్​నగర్ డిపోలో ఆర్టీసీ డ్రైవర్​గా విధులు నిర్వహిస్తున్న మహమ్మద్ ఖాజా స్వస్థలం నాగర్​కర్నూల్​ జిల్లా బిజినాపల్లి మండలం పాలెం. ఆర్టీసీ సమ్మె ఉండడం వల్ల తీవ్ర ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నాడు. ఇల్లు గడవక భార్య పిల్లలతో కూలీ పనికి వెళ్తున్నాడు. బాధలు చూడలేక ఈరోజు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి ఒడిగట్టాడు. నాగర్​కర్నూల్ జిల్లా ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉంది. బాధితుడిని మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి పరామర్శించారు. కార్మికుల ఆత్మహత్యలకు ముఖ్యమంత్రి కేసీఆర్​ బాధ్యుడన్నారు. కార్మికులు ఎవరూ అధైర్యపడొద్దని ప్రజలందరూ మీ వెంట ఉన్నారని భరోసా ఇచ్చారు.

పురుగుల మందు తాగిన ఆర్టీసీ కార్మికుడు

ABOUT THE AUTHOR

...view details