అకాల వర్షంతో అన్నదాతకు కష్టం
నాగర్కర్నూలు జిల్లా కల్వకుర్తిలో అకాల వర్షం కారణంగా మార్కెట్ యార్డులో నిల్వ ఉంచిన వరి ధాన్యం వర్షంలో తడిసి పోయింది.
అకాల వర్షంతో అన్నదాతకు కష్టం
నాగర్కర్నూల్ జిల్లా కల్వకుర్తిలో బుధవారం సాయంత్రం కురిసిన వర్షానికి వ్యవసాయ మార్కెట్లో అమ్మకానికి తెచ్చిన ధాన్యం తడిసింది. కొందరు రైతులు కవర్లు కప్పినా అధిక వర్షం కురవటం వల్ల ధాన్యం బస్తాలు, రాసుల కిందకు నీరు చేరింది. రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని అన్నదాతలు విజ్ఞప్తి చేశారు. పట్టణం దారులన్నీ జలమయమయ్యాయి. కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.