తెలంగాణ

telangana

ETV Bharat / state

'ధరణి ప్రాజెక్టులోని లోపల వల్లే..' - నాగర్​కర్నూల్​లో రెవెన్యూ ఉద్యోగుల ఆందోళన

ధరణి ప్రాజెక్టులో ఉన్న లోపాల కారణంగానే ప్రజలకు రెవెన్యూ వ్యవస్థపై చెడు అభిప్రాయం ఏర్పడిందని నాగర్​కర్నూల్ జిల్లా రెవెన్యూ ఉద్యోగులు వాపోయారు.

రెవెన్యూ ఉద్యోుగుల ఆందోళన

By

Published : Nov 7, 2019, 10:04 PM IST

సజీవ దహనమైన అబ్దుల్లాపూర్​మెట్​ తహసీల్దార్​ విజయారెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు నాగర్​కర్నూల్ జిల్లా కలెక్టర్ శ్రీధర్, జేసీ శ్రీనివాస్​రెడ్డి. జిల్లా కలెక్టరేట్ ముందు రెవెన్యూ ఉద్యోగులు, వివిధ శాఖల నాయకులు నిరసన తెలిపారు. రెవెన్యూ ఉద్యోగులు విధులను బహిష్కరించి ధర్నాకు దిగారు. ధరణి ప్రాజెక్టులో ఉన్న లోపాల కారణంగానే ఈరోజు ఈ సమస్య ఏర్పడిందని రెవెన్యూ ఉద్యోగులు వాపోయారు. సర్కారు తీసుకొవచ్చిన కొత్త విధానాల వల్లే ప్రజలకు రెవెన్యూ వ్యవస్థపై చెడు అభిప్రాయం ఏర్పడిందని ఆందోళన వ్యక్తం చేశారు.

రెవెన్యూ ఉద్యోగుల ఆందోళన

ABOUT THE AUTHOR

...view details