తెలంగాణ

telangana

ETV Bharat / state

'మా బావే అక్కను చంపేశాడు'

'మా అక్క నాకే బైక్​ నేర్పించింది. చాలా ధైర్యవంతురాలు. ఎస్సై ఎంపికలో తృటిలో అవకాశం​ కోల్పోయింది. అలాంటిది ఉరి వేసుకుని చనిపోయిందంటే నేను నమ్మను. ఇది కచ్చితంగా బావ చేసిన పనే' అంటూ ఓ తమ్ముడు ఆవేదన చెందుతున్నాడు.

By

Published : Mar 6, 2020, 3:39 PM IST

pregnant lady suspected death at bijinepalli mandal in nagarkurnool district
'మా అక్క ఉరి వేసుకునేంత పిరికిది కాదు... బావే తనని చంపేశాడు'

నాగర్ కర్నూల్​ జిల్లా బిజినేపల్లి మండలం వట్టెం గ్రామంలో ఓ ఐదు నెలల గర్భవతి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. వనపర్తికి చెందిన లావణ్యతో గతేడాది జూన్​లో వట్టెం గ్రామానికి చెందిన వెంకటేష్​కు వివాహం జరిపించారు. అప్పటి నుంచే ఆమెను అదనపు కట్నం కోసం అత్తింటి వారు వేధించేవారని ఆరోపిస్తూ... కొన్ని నెలల క్రితం పుట్టింటికి వెళ్లింది.

బంధువుల సమక్షంలో రాజీకుదిర్చి పంపగా.. వేధింపులు మాత్రం తగ్గలేదని మృతురాలి సోదరుడు ఆరోపించారు. లావణ్య గర్భవతి అయిందని, ఇక వారి మధ్య గొడవలు తగ్గుతాయని లావణ్య కుటుంబ సభ్యులు ఆశించగా... ఎవరూ లేని సమయంలో లావణ్య ఉరి వేసుకుని చనిపోయిందని వెంకటేష్ ఫోన్ చేసి తెలిపాడు.

'మా బావే అక్కను చంపేశాడు'

దిగ్భ్రాంతికి గురైన లావణ్య తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. అల్లుడే కూతురిని చంపి ఉరి వేసుకున్నట్లు చిత్రీకరించాడని ఆరోపించారు. "మా అక్క నాకే బైక్ నేర్పించిన ధైర్యవంతురాలు... ఎస్సై ఎంపికల్ తృటిలో జాబ్​ కోల్పోయింది. అలాంటిది తను ఉరి వేసుకుని చనిపోయిందంటే నమ్మేదే లేదంటూ " మృతురాలి తమ్ముడు వాపోయాడు.

పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం జిల్లా ఆస్పత్రికి తరలించారు.

ఇవీ చూడండి:భయాలు పటాపంచలు.. ఇద్దరు అనుమానితుల్లో వైరస్​ లేదు

ABOUT THE AUTHOR

...view details