నాగర్ కర్నూల్ జిల్లాలో పిడుగు ధాటికి తాడిచెట్టు దగ్ధం
నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండల పరిధిలోని చింతలపల్లి గ్రామంలో రాత్రి ఉరుములు మెరుపులతో వర్షం కురిసింది. పిడుగు ధాటికి తాడిచెట్టు దగ్ధం అయ్యింది. మిరుగులు చెల్లాచెదురుగా పడి పోగా.. పక్కనే పొలంలో ఉన్న రైతులు భయాందోళనకు గురయ్యారు.