తెలంగాణ

telangana

ETV Bharat / state

ఉమ్మడి పాలమూరులో  కరోనా ఉద్ధృతి.. కొత్తగా 29 కేసులు - ఉమ్మడి పాలమూరులో కరోనా తాజా వార్తలు

ఉమ్మడి పాలమూరు ​జిల్లాలో కరోనా ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. బాధితుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. సోమవారం కొత్తగా జిల్లాలో మరో 29 పాజిటివ్​ కేసులు నమోదు కాగా.. ఒకరు మృతి చెందారు.

Ongoing corona extraction in joint palate .. 29 new cases
ఉమ్మడి పాలమూరులో కొనసాగుతోన్న కరోనా ఉద్ధృతి.. కొత్తగా 29 కేసులు

By

Published : Jul 14, 2020, 11:26 AM IST

ఉమ్మడి మహబూబ్​నగర్ ​జిల్లాలో కొవిడ్‌-19 కేసుల విజృంభణ కొనసాగుతోంది. సోమవారం కొత్తగా 29 కేసులు నమోదయ్యాయి. ఫలితంగా మొత్తం కేసుల సంఖ్య 478కి చేరింది. అత్యధికంగా మహబూబ్‌నగర్‌ జిల్లాలో 17 కేసులు బయటపడగా.. నాగర్‌కర్నూల్‌ జిల్లాలో 5, గద్వాల జిల్లాలో 5, నారాయణపేట, వనపర్తి జిల్లాల్లో ఒక్కో పాజిటివ్‌ కేసు నమోదయ్యాయి.

మహబూబ్​నగర్​లో..

మహబూబ్​నగర్​ జిల్లాలో 17 మంది కరోనా బారినపడగా.. పట్టణంలోనే 11 మందికి వైరస్​ సోకింది. హౌసింగ్‌ బోర్డు కాలనీలో ఇది వరకే ఒకరికి కరోనా నిర్ధారణ కాగా.. అదే ఇంట్లో మరో ముగ్గురుకి పాజిటివ్‌ వచ్చింది. మైత్రీనగర్‌, పద్మావతి కాలనీ, బీకే రెడ్డి కాలనీల్లో రెండేసి చొప్పున.. మొత్తం 6 మంది కరోనా బారినపడ్డారు. గణేశ్​నగర్​లో ఒకరు, హన్వాడ మండల కేంద్రంలో ఒకరికి కరోనా నిర్ధారణయింది. జడ్చర్లలో ఐదుగురు ఈ మహమ్మారి బారినపడగా.. వారిలో ఇద్దరు దంపతులు, ఒక విద్యార్థి, ఓ దుకాణా యజమాని, ఒకరు ఫార్మా కంపెనీ ఉద్యోగిగా ఉన్నారు.

నాగర్ కర్నూల్​లో..

నాగర్​కర్నూల్ జిల్లాలో ఐదుగురికి కరోనా పాజిటివ్​గా నిర్ధారణయింది. అమ్రాబాద్ మండలం ఈగలపెంట జెన్​కోలో పనిచేస్తున్న ఉద్యోగితో పాటు ఇద్దరు కుటుంబ సభ్యులు వైరస్​ బారినపడ్డారు. నాగర్​కర్నూల్ పట్టణానికి చెందిన ఓ ఎస్సైకి కరోనా పాజిటివ్​గా నిర్ధారణ కాగా.. అచ్చంపేట పట్టణానికి చెందిన ఓ వ్యక్తి కరోనా బారినపడినట్టు వైద్యాధికారి వెల్లడించారు.

నారాయణపేట, వనపర్తిల్లో

ఇక నారాయణపేట, వనపర్తి జిల్లాల్లో ఒక్కోటి చొప్పున కేసులు నమోదయ్యాయి. ఊట్కూరు ఎఎస్సైకి పాజిటివ్‌గా నిర్ధారణ కావడం వల్ల అతని ప్రైమరీ కాంటాక్ట్​గా ఉన్న 13 మంది పోలీస్ సిబ్బందిని హోం క్వారంటైన్​లో ఉంచారు. వనపర్తి జిల్లా వీపనగండ్ల మండలంలోని గోవర్దనగిరిలో ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు మండల వైద్యాధికారి వెల్లడించారు.

గద్వాలలో..

జోగులాంబ గద్వాల జిల్లాలో ఐదుగురికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణయింది. గద్వాల పట్టణానికి చెందిన నలుగురు, రాజోళిలో మరొకరు వైరస్​ బారినపడ్డారు. కరోనాతో చికిత్స పొందుతూ ఒకరు మృతి చెందారు.

ఇదీచూడండి: కరీంనగర్​లో కరోనా విజృంభన.. ఒక్కరోజే 86 కేసులు

ABOUT THE AUTHOR

...view details