తెలంగాణ

telangana

ETV Bharat / state

అచ్చంపేటలో కలకలం రేపుతున్న మరో హత్య - murder mistry

అచ్చంపేటలో గుర్తుతెలియని వ్యక్తులు వెంకటయ్య అనే ఇందిరానగర్​ వాసిని దారుణంగా హత్య చేశారు. ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు బాత్​రూమ్​లో వేలాడదీశారు. మృతుని కుటుంబసభ్యులను ప్రభుత్వ విప్​ గువ్వల బాలరాజు పరామర్శించారు.

murder mistry in achampeta indira nagar colony
అచ్చంపేటలో కలకలం రేపుతున్న మరో హత్య

By

Published : Mar 3, 2020, 11:35 PM IST

నాగర్​కర్నూల్ జిల్లా అచ్చంపేట పట్టణం ఇందిరానగర్​లో ముచ్చపోతుల వెంకటయ్య అనే వ్యక్తిని దుండగులు హత్య చేశారు. ఐనోల్​లో వ్యక్తి దారుణ హత్యకు గురై 24 గంటలు గడవక ముందే జరిగిన ఈ ఉదంతం పట్టణంలో కలకలం రేపుతోంది. హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు బాత్​రూమ్​లో వేలాడదీశారు. స్థానికుల సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఈ దారుణానికి ఒడిగట్టింది సమీప బందువులేనని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టానికి అచ్చంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు ఘటనాస్థలికి చేరుకొని మృతుని కుటుంబసభ్యులను పరామర్శించారు.

అచ్చంపేటలో కలకలం రేపుతున్న మరో హత్య

ఇదీ చూడండి :దేశంలో మరో ఆరుగురికి కరోనా

ABOUT THE AUTHOR

...view details